ప్రస్తుతం ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఒమిక్రాన్ సంగతి మరో వారం రోజుల్లో తేల్చేస్తామని భారతీయ శాస్త్రవేత్తలు అంటున్నారు. ఒమిక్రాన్ వైరస్పై అధ్యయనం జరుగుతోంది.. త్వరలోనే దీని గురించి కీలకమైన సమాచారం సేకరిస్తామని, వైరస్ పనితీరును బట్టి దాని నియంత్రణ మార్గాలు తెలుస్తాయని పుణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి చెందిన ఒక శాస్త్రవేత్త తెలిపారు. ముంబై, హైదరాబాద్లకు చెందిన ఇద్దరు ఒమిక్రాన్ సోకిన రోగుల నుంచి రక్తపు శాంపిల్స్ తీసుకొని అందులోనుంచి వైరస్ను వేరు చేసే ప్రక్రియ ప్రస్తుతం జరుగుతోందని ఆయన అన్నారు.
అలాగే.. హైదరాబాద్కు చెందిన సిసియంబీ శాస్తవేత్త మాట్లాడుతూ.. “ఐసిఎంఆర్ నిపుణులతో కలిసి వ్యాక్సిన్ తీసుకున్నాక ఒమిక్రాన్ వైరస్ ప్రభావం ఎలా ఉంటుంది, ఎంత ఉంటుంది అనే అంశాలపై అధ్యయనం చేసున్నాం” అని చెప్పారు. వ్యాక్సిన్ తీసుకున్నాక ఒమిక్రాన్ సోకిన వారి శరీరంలో యంటీబాడాల పెరుగుదల ఏ స్థాయిలో ఉంటుందో ఈ అధ్యయనంతో త్వరలోనే తెలుస్తుందని ఆయన అన్నారు. ఈ అధ్యయనం చేసేందుకు ఒమిక్రాన్ వైరస్ని సిరియా ఎలుకలపై ప్రయోగించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.
ఎలుకలపై చేసే పరీక్షల ఫలితాలు వారం రోజుల్లో తెలుస్తాయని. అయితే దీనిపై పూర్తి వివరాలు రెండు నుంచి నాలుగు వారాల్లో వెల్లడిస్తామని వారు అంటున్నారు.