న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఒక్కరోజే 12 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో నాలుగు కేసులు, మహారాష్ట్రలో మరో 8 కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 61కి చేరింది. ఇప్పటివరకు మహారాష్ట్రలో అత్యధికంగా 28 కేసులు, రాజస్థాన్లో 17, ఢిల్లీలో ఆరు, గుజరాత్లో 4, కర్ణాటకలో 3, కేరళ, ఆంధ్రప్రదేశ్, చండీగఢ్లో ఒకటి చొప్పున ఒమిక్రాన్ కేసులు వెలుగులోకి వచ్చాయి.