Omicron : భారత్లో డెల్టా వేవ్ తరహాలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతాయని జనవరి నెలాఖరు నుంచి ఫిబ్రవరి తొలి వారం మధ్య తాజా వేవ్ ముమ్మర దశకు చేరుతుందని ఇనిస్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవల్యూషన్ (ఐహెచ్ఎంఈ) డైరెక్టర్ డాక్టర్ క్రిష్టాఫర్ ముర్రే పేర్కొన్నారు.
వ్యాక్సినేషన్ ప్రక్రియ మెరుగ్గా సాగడంతో వైరస్ లక్షణాలు స్వల్పంగానే ఉన్నా ఒమిక్రాన్ వేరియంట్ పెద్దసంఖ్యలో ప్రజలకు సోకుతుందని, ఎలాంటి నియంత్రణలు దాన్ని నిరోధించలేవని అన్నారు. ఒమిక్రాన్ వేరియంట్ కేవలం రెండు నెలల్లోనే ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల మందికి వ్యాప్తి చెందుతుందని డాక్టర్ ముర్రే ఆందోళన వ్యక్తం చేశారు. ఒమిక్రాన్ కేసుల పెరుగుదలతో డెల్టా వేవ్లో నమోదైన కేసుల తరహాలో భారత్లో మరోసారి భారీ సంఖ్యలో ఇన్ఫెక్షన్లు వెలుగుచూస్తాయని అన్నారు.
తాజా కేసుల్లో ఆస్పత్రులపాలు కావడం, మరణాల సంఖ్య తక్కవగా ఉండటం ఊరట ఇచ్చే అంశమని చెప్పారు. అమెరికాలో డెల్టా ముమ్మర దశలో ఉండగా చోటుచేసుకున్న మరణాలతో పోలిస్తే తాజా వేవ్లో మరణాలు తక్కువగా నమోదవుతాయని డాక్టర్ ముర్రే అంచనా వేశారు.