న్యూఢిల్లీ: భారతీయ నౌకా సిబ్బంది ఉన్న ఆయిల్ ట్యాంకర్పై అమెరికా నేవీ దాడి చేసింది. దీంతో ఆ వాణిజ్య నౌకలో మంటలు చెలరేగాయి. మునిగిపోతున్న ఆ ఆయిల్ ట్యాంకర్లోని భారతీయ సిబ్బందిని కాపాడారు. (Ship with 24 Indian seafarers hit) ఒమన్లోని మసిరా ద్వీపం సమీపంలో ఈ సంఘటన జరిగింది. సోమవారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో ‘ఎంటి మారివెక్స్’ షిప్పై దాడి నేపథ్యంలో మంటలు చెలరేగాయి. దీంతో సహాయం కోసం సిబ్బంది ఎస్ఓఎస్ కాల్స్ చేసినట్లు నౌకా రవాణా మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆ ఆయిల్ ట్యాంకర్లో 24 మంది భారతీయ సిబ్బంది ఉన్నట్లు ధృవీకరించింది.
కాగా, సముద్రంలో మునిగిపోతున్న ఆయిల్ ట్యాంకర్లోని భారతీయ సిబ్బంది సురక్షితంగా ఉన్నారని నౌకా రవాణా మంత్రిత్వ శాఖ నిర్ధారించింది. వారి భద్రత కోసం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు, భారత నౌకాదళం, రక్షణ మంత్రిత్వ శాఖతో కలిసి సమన్వయం చేసినట్లు పేర్కొంది. ప్రస్తుతం పర్షియన్ గల్ఫ్లో ఉన్న అన్ని భారతీయ నౌకలు, సిబ్బంది భద్రతను నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించింది.