న్యూఢిల్లీ: చమురు సంస్థలు ప్రస్తుతం పెట్రోల్పై రూ.10 లాభం పొందుతున్నాయని, అదే సమయంలో డీజిల్పై రూ.6.50 నష్టం భరిస్తున్నాయని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ నివేదిక తెలిపింది. పెట్రోల్పై లాభం వస్తున్నప్పటికీ కంపెనీలు ధరలను తగ్గించడం లేదు.
అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు అధికంగా ఉన్నప్పుడు వచ్చిన నష్టాలను, అలాగే డీజిల్పై ప్రస్తుతం భరిస్తున్న నష్టాలను పూడ్చుకునేందుకు ధరలను తగ్గించడం లేదని ఈ నివేదిక పేర్కొన్నది.
కాగా, అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరిగిన సందర్భంలో ఇంధన ధరలను కేంద్రం ఇబ్బడి ముబ్బడిగా పెంచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు క్రూడాయిల్ ధరలు భారీగా తగ్గినప్పటికీ ఆ ధరలను తగ్గించడం లేదు.