EVM Change in UP | ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఈవీఎం యంత్రాల విశ్వసనీయతపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. పోలింగ్ తర్వాత ఈవీఎం మార్చారంటూ మాజీ సీఎం, సమాజ్వాదీ పార్టీ ఎంపీ అఖిలేశ్ యాదవ్ లేవనెత్తిన అంశాల వీడియో వైరలైంది. ఈవీఎం మిషన్ రీప్లేస్మెంట్పై ఒక వ్యక్తితో ఓ ఎన్నికల అధికారి మాట్లాడిన ఆడియో కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నది. దీన్ని సుప్రీంకోర్టు, రాష్ట్రపతి తక్షణం జోక్యం చేసుకుని విచారణకు ఆదేశించాలని సుప్రీంకోర్టును అఖిలేశ్ యాదవ్ కోరారు.
తమకు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికంటే దీనిపై దర్యాప్తు జరుగడం ముఖ్యమని అఖిలేశ్ యాదవ్ పేర్కొన్నారు. ఆడియో లీక్ అయిన వ్యక్తికి పూర్తి రక్షణ కల్పించడంతోపాటు నిష్పక్షపాతంగా దర్యాప్తు జరుగాలని స్పష్టం చేశారు.
ఇద్దరు వ్యక్తుల మధ్య 10 నిమిషాలు జరిగిన ఆడియో సంభాషణ సోషల్ మీడియాలో వైరలైందని మీడియాలో వార్తలొచ్చాయి. ప్రతి బూత్లోనూ ఈవీఎం రీప్లేస్ అయిందన్నారు ఆ అధికారి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈవీఎంలు మార్చేశారని సదరు ఎన్నికల అధికారి చెప్పారు.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత అఖిలేశ్ యాదవ్ స్పందిస్తూ.. తమ పార్టీ మెరుగైన ఫలితాలు సాధించిందని చెప్పారు. రెండున్నరరెట్లు సీట్లు పెంచుకునేందుకు సహకరించినందుకు యూపీ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో మారుస్తున్న ఈవీఎంను పట్టుకోవడంతో సదరు ఎన్నికలధికారిపై కేసు పెట్టారు