భువనేశ్వర్: వన్డే క్రికెట్ ప్రపంచకప్లో ఐదు వరుస విజయాలతో టీమ్ఇండియా (Team India) ప్రస్తానం అప్రతిహతంగా సాగుతున్నది. అన్ని విభాగాల్లో రానిస్తూ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాక్ వంటి మేటి జట్లను సునాయాసంగా ఓడించి పాయింట్ల పట్టికలో ప్రస్తుతం రెండో స్థానంలో కొనసాగుతున్నది. దీంతో భారత క్రికెట్ జట్టు (Indian Cricket team) మరోసారి ప్రపంచకప్ సాధిస్తుందని కోట్లాది మంది భారతీయులు శతకోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. భారత జట్టుకు మద్దతుగా నిలుస్తూన్నారు. ఇదే క్రమంలో ఒడిశాలోని భువనేశ్వర్కు చెందిన ఓ పేస్ట్రీ చెఫ్ (Pastry Chef).. భారత జట్టుపై తన అభిమానాన్ని ప్రత్యేకంగా చాటుకున్నారు. టీమ్ఇండియా వరల్డ్కప్ను గెలవాలని ఆకాంక్షిస్తూ.. చాకెట్లతో (Chocolate) ప్రపంచకప్ ట్రోఫీని (World Cup Trophy) తయారు చేశారు.
టీమ్ ఇండియాను ఉత్సాహ పరిచేందుకు తాము ఈ చాక్లెట్ రెప్లికాను (Chocolate Replica) తయారు చేశామని పేస్ట్రీ చెఫ్ రాకేశ్ సాహు (Pastry Chef Rakesh Sahu) అన్నారు. మరో ఎనిమిది మందితో కలిసి దీనిని రూపొందించానని, దీనిని పూర్తిచేయడానికి మూడు రోజులపాటు శ్రమించామని తెలిపారు. పూర్తిగా చాక్లెట్లతో మూడు స్తంభాలు వాటిపై బంతిని తయారు చేయడం చాలా కష్టమైందన్నారు. చాక్లెట్ కరగకుండా ఉష్ణోగ్రతను నిర్వహించడం కూడా సవాలుగా మారిందని వెల్లడించారు.
#WATCH | Bhubaneswar, Odisha: Rakesh Sahu says, “We have crafted a chocolate replica of the ICC Cricket World Cup trophy to cheer up India team… It took us three days to complete the trophy from top to bottom… It was quite difficult to make the three pillars and the ball… pic.twitter.com/SmB25swDe7
— ANI (@ANI) October 29, 2023