బెర్హాంపూర్ (ఒడిశా): బెడ్రూమ్లోకి తాచుపామును వదిలి భార్య, బిడ్డను చంపేశాడు ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి. భార్యతో తరచూ గొడవల కారణంగా ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బెర్హాంపూర్ జిల్లా కబిసూర్యనగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని అధేయిగావ్లో ఈ ఘటన గత నెలలో చోటుచేసుకున్నది. మృతురాలి భర్తను పోలీసులు అరెస్టుచేశారు. కే గణేశ్పాత్రతో కే బసంతిపాత్ర (23)కి నాలుగేండ్ల క్రితం వివాహమైంది. వీరి రెండేండ్ల కూతురు దేబస్మి ఉన్నది. ఎలాగైనా భార్యను చంపాలనుకున్న గణేశ్.. పాములు పట్టేవారిని సంప్రదించి తాచుపామును కొన్నాడు. ప్లాస్టిక్ జార్లో పామును తెచ్చి భార్యబిడ్డలు పడుకున్న గదిలో రాత్రి వదిలాడు.