భువనేశ్వర్: కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలోని పది జిల్లాల్లో నైట్ కర్ఫ్యూ విధించనున్నట్లు శనివారం తెలిపింది. ఈ నెల 5 నుంచి రాత్రి పది గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందని పేర్కొంది. సుందర్గఢ్, ఝార్సుగూడ, సంబల్పూర్, బార్గఢ్, బోలంగీర్, నౌపాడా, కలహండి, నవరంగ్పూర్, కొరాపుట్, మల్కన్గిరి జిల్లాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నందున సోమవారం నుంచి రాత్రి పూట కర్ఫ్యూ విధిస్తున్నట్లు వెల్లడించింది.