Naveen Patnaik | భువనేశ్వర్, జూలై 22: దేశంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా చేసిన నేతల జాబితాలో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ రెండో స్థానంలో నిలిచారు. శనివారంతో ఆయన పశ్చిమబెంగాల్ మాజీ సీఎం జ్యోతిబసు స్థానాన్ని భర్తీ చేశారు.
ఒడిశాకు ఐదుసార్లు సీఎంగా ఉన్న నవీన్ పట్నాయక్.. శనివారం నాటికి ఆయన పదవిలో ఉన్న కాలం 23 ఏండ్ల 138 రోజులుగా ఉన్నది. జ్యోతి బసు బెంగాల్కు 23 ఏండ్ల 137 రోజులపాటు సీఎంగా సేవలందించారు. ఇక, అత్యధిక కాలం సీఎంగా చేసిన వారిలో.. సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్కుమార్ చామ్లింగ్ ఇప్పటికీ మొదటి స్థానంలో కొనసాగుతున్నారు. సిక్కిం సీఎంగా చామ్లింగ్ 24 ఏండ్లకు పైగా పనిచేశారు.