న్యూఢిల్లీ, అక్టోబర్ 2: లోకో పైలట్ అప్రమత్తంగా వ్యవహరించటంతో ఉదయ్పూర్-జైపూర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. రైల్వే ట్రాక్పై అడ్డంగా బండరాళ్లు, ఇనుప రాడ్లు ఉండటాన్ని గుర్తించిన రైలు డ్రైవర్ అత్యవసర బ్రేక్స్ సాయంతో రైలును వెంటనే నిలిపివేశాడు. దీంతో ప్రమాదం తప్పింది.
సోమవారం నాటి ఈ ఘటనకు సంబంధించి వీడియో ఒకటి సోషల్మీడియాలో వైరల్ అయ్యింది. ఉదయ్పూర్లో ఉదయం 7.50 గంటలకు బయల్దేరిన రైలు, 9.55 గంటలకు గంగరార్-సోనియాన్ సెక్షన్ వద్ద అత్యవసరంగా ఆపాల్సి వచ్చింది. స్థానిక పోలీసులు, రైల్వే పోలీసులు సంయుక్తంగా ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నారు.