న్యూఢిల్లీ : ఎన్ఆర్ఐ మహిళ చీరకట్టులో స్కీయింగ్ చేస్తున్న వీడియో (viral video ) ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సాథ్ సీఈవో దివ్య మైయ పింక్ శారీ ధరించి పర్వతాల్లో స్కీయింగ్ చేసిన వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఏప్రిల్ 11న ఈ క్లిప్ను ఇన్స్టాగ్రాంలో షేర్ చేయగా ఇప్పటివరకూ ఏకంగా 20 లక్షల మంది వీక్షించారు.
శీతాకాలం ముగిసే సమయంలో ఈ సీజన్లో తనకు మద్దతుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు. స్పోర్ట్స్పర్సన్, డ్యాన్స్ పెర్ఫామర్గా ఈ అనుభవం నాకు గొప్పగా అనిపిస్తోందని వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంది. కొందరు యూజర్లు తమ స్కీయింగ్ స్టోరీలను షేర్ చేశారు.
Read More