చండీగఢ్: ఇప్పటి నుంచి అసెంబ్లీ ఎన్నికలపై సీరియస్గా ఆలోచిస్తామని పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ తెలిపారు. ఫిబ్రవరి 14న ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని శనివారం ఈసీ ప్రకటించిన ఎన్నికల షెడ్యూల్పై ఆయన స్పందించారు. ఈసీ సూచనలను తాను స్వాగతిస్తున్నానని అన్నారు. ఇప్పటి వరకు తమది పని చేసే ప్రభుత్వం మాత్రమే అని సీఎం చన్నీ తెలిపారు. ఇప్పుడు ఎన్నికల గురించి ఆలోచిస్తామని చెప్పారు. 111 రోజుల పాటు ముఖ్యమంత్రిగా ఉండేందుకు తనను అర్హుడిగా భావించిన పంజాబ్ ప్రజలు, కాంగ్రెస్ పార్టీకి ముకుళిత హస్తాలతో కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు.
మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటన సందర్భంగా ఎలాంటి భద్రతా లోపం తలెత్తలేదని సీఎం చన్నీ మరోసారి స్పష్టం చేశారు. ప్రధానికి ఇక్కడ ఎలాంటి ముప్పు జరుగలేదని, ఆయన పూర్తిగా క్షేమంగా ఉన్నారని తెలిపారు. ఎవరూ కూడా ప్రధాని దగ్గరకు వెళ్లలేదన్నారు. మోదీ పర్యటన రోజున ఏం జరిగిందన్నది ప్రియాంక గాంధీకి వివరించినట్లు ఆయన చెప్పారు.