న్యూఢిల్లీ : జమ్ము కశ్మీర్లోని (Jammu and Kashmir) రాజౌరి, కుప్వారా జిల్లాల్లో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరుగుతున్న క్రమంలో నార్తర్న్ ఆర్మీ కమాండర్ పాకిస్తాన్పై సంచలన ఆరోపణలు చేశారు. వాస్తవాధీన రేఖ వెంబడి ఉగ్రవాదుల చొరబాట్లను పాకిస్తాన్ ప్రోత్సఃహిస్తోందని, జమ్ము కశ్మీర్లో శాంతికి విఘాతం కల్పిస్తోందని నార్తర్న్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది బుధవారం పేర్కొన్నారు.
కశ్మీర్లో అలజడి రేపేందుకు పాకిస్తాన్ ఎల్ఓసీ గుండా ఉగ్రమూకలను పంపుతోందని దుయ్యబట్టారు. ఈ ఏడాది కశ్మీర్ లోయ 2.25 కోట్ల మంది పర్యాటకులను ఆకట్టుకుంటుండగా కన్ను కుట్టిన పాకిస్తాన్ కశ్మీర్లో శాంతిని భగ్నం చేసేందుకు ఉగ్రవాదులను పంపుతోందని అన్నారు.
పాకిస్తాన్ కుయుక్తులను తాము తిప్పికొడతామని చెప్పారు. కాగా, రాజౌరీ జిల్లాలోని నర్లా ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి.
Read More :
TS Weather | మరో మూడురోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ..!