న్యూఢిల్లీ: ఈ ఏడాది వర్షాకాలం(Rainy season) సాధారణంగా ఉండనున్నది. నైరుతీ రుతుపవనాల(Monsoon) వల్ల వర్షాలు సాధారణంగా ఉంటాయని ఇవాళ భారతీయ వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ మహాపాత్ర(IMD Director Mrutyunjaya) తెలిపారు. వర్షాకాలం మధ్యలో ఎల్ నినో పరిస్థితులు ఉత్పన్నం అయ్యే అవకాశాలు ఉన్నాయని, దాని వల్ల రుతుపవనాలపై ప్రభావం పడుతుందని, సీజన్ రెండో భాగంలో వర్షాలు తక్కువగా కురిసే అవకాశాలు ఉన్నట్లు ఐఎండీ డైరెక్టర్ జనరల్ తెలిపారు.
Link for Press Release for Long Range Forecast of 2023 Southwest Season Monsoon Rainfall:- https://t.co/T4UgMQocoX https://t.co/MluUL1rHwP
— India Meteorological Department (@Indiametdept) April 11, 2023
2023లో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు 96 శాతం వర్షపాతం ఉంటుందని ఐఎండీ చెప్పింది. జూలైలో ఎల్ నినో(El Nino) పరిస్థితుల డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
Link for Press Release for Long Range Forecast of 2023 Southwest Season Monsoon Rainfall:- https://t.co/T4UgMQocoX
प्रेस विज्ञप्ति:https://t.co/DBk4PG0PGo https://t.co/0SaQr59bzd— India Meteorological Department (@Indiametdept) April 11, 2023
ఎల్ నినో వల్ల పసిఫిక్ సముద్ర ఉపరితలం వేడిగా మారుతుంది.దీని వల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణాల్లో మార్పు సంభవిస్తుంది. ఇండియాపై కూడా ఈ ప్రభావం ఉంటుంది. ఒకవేళ నైరుతీ రుతుపవనాల సమయంలో ఎల్నినో ఉంటే, అప్పుడు వర్షాలపై ప్రభావం పడే ఛాన్సు ఉంది. దీని వల్ల రైతులకు మరిన్ని కష్టాలు తప్పవు. ఎల్నినో వల్ల సాధారణంగా ఇండియాలో వర్షపాతం తక్కువగా నమోదు అవుతుంది. దీంతో కరువు పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. ఎక్కువ శాతం రైతులు వర్షాలపై ఆధారపడడం వల్ల.. ఎల్నినో వ్యవసాయంపై ప్రభావం చూపే అవకాశం ఉంది.