Terrorists | శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పంజాబ్ కార్మికులపై టెర్రరిస్టులు కాల్పులు జరిపారు. దీంతో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
హబ్బా కడల్ ప్రాంతంలో బుధవారం రాత్రి 7 గంటల సమయంలో ఏకే 47తో ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. మృతుడిని అమృత్సర్కు చెందిన అమృత్పాల్ సింగ్గా పోలీసులు గుర్తించారు. గాయాలైన వ్యక్తిని రోహిత్గా గుర్తించి, చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 2024లో స్థానికేతరులపై జరిగిన తొలి దాడి ఇదే. గతేడాది కశ్మీర్ లోయలోని అనంత్ నాగ్, సోపియాన్ ప్రాంతాల్లో స్థానికేతర కార్మికులపై దాడులు జరిగిన విషయం తెలిసిందే.