ముంబై : నకిలీ కుల ధ్రువీకరణ పత్రం కేసులో లోక్సభ ఎంపీ నవనీత్ రాణా, ఆయన తండ్రిపై ముంబై కోర్టు సోమవారం నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. ఇంతకు ముందు సెప్టెంబర్లోనూ కోర్టు ఎంపీతో పాటు ఆమె తండ్రిపై వారెంట్ జారీ అయ్యింది. ఈ క్రమంలో కొనసాగుతున్న కేసుపై సోమవారం మరోసారి కోర్టులో విచారణ జరిగింది. వారెంట్ అమలు కోసం మరింత సమయం కావాలని పోలీసులు కోరారు.
పోలీసుల విజ్ఞప్తిని తోసిపుచ్చిన కోర్టు.. వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ నవనీత్ రాణాతో పాటు ఆయన తండ్రిపై తాజాగా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. ఆ తర్వాత సర్వీస్ ఆఫ్ వారెంట్పై నివేదికను సమర్పించేందుకు కేసు విచారణను ఈ నెల 28కి వాయిదా చేశారు. ఎంపీ నవనీత్ రాణా, ఆమె తండ్రి నకిలీ కుల ధ్రువీకరణ పత్రాలు పొందినట్లు ఆరోపణలున్నాయి.
ఈ మేరకు ముంబైలోని ములుంద్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. ఈ మేరకు కేసు నమోదైంది. అయితే, షెడ్యూల్డ్ కులాలకు రిజర్వ్ అయిన అమరావతి ఎంపీ స్థానంలో నకిలీ కులధ్రువీకరణ పత్రంతో పోటీ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. గతంలో బాంబే హైకోర్టు నవనీత్ రాణాకు జారీ చేసిన కుల ధ్రువీకరణపత్రాన్ని రద్దు చేసింది.