ముంబై : (Parambir Singh) మాజీ పోలీసు కమిషనర్ పరంబీర్ సింగ్పై మహారాష్ట్రలోని థానే కోర్టు గురువారం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అక్రమార్జన కేసులో విచారణకు హాజరు కావాలని ఇటీవల క్రైం బ్రాంచ్ పరంబీర్ సింగ్ను ఆదేశించింది. అయితే, అతడు కనిపించకుండా పోయాడని పోలీసులు కోర్టు దృష్టికి తేవడంతో.. కోర్టు సీరియస్గా పరిగణించి ఎన్బీడబ్ల్యూ జారీ చేసింది. జూలై 23 న పరంబీర్ సింగ్పై కేసు నమోదైంది. అనంతరం కేసు దర్యాప్తును క్రైం బ్రాంచ్కు అప్పగించారు. ఉద్యోగం నుంచి తొలగింపునకు గురైన పోలీస్ మాజీ ఉన్నతాధికారి సచిన్ వాజేతో పాటు చాలా మంది పోలీసులకు ఈ కేసుతో సంబంధమున్నది.
పరంబీర్ సింగ్పై మరో కేసులో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆ కేసులో కూడా పరంబీర్పై విచారణ జరుగుతున్నది. అయితే పరంబీర్ సింగ్ గత రెండు నెలలుగా ముంబైలో కనిపించడం లేదని వార్తలు వచ్చాయి. మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్పై చేసిన ఫిర్యాదుపై తన వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరు కాలేదు. కొద్ది రోజుల క్రితం ముంబై పోలీసులు అతడిపై లుకౌట్ నోటీసు కూడా జారీ చేశారు. పరంబీర్ సింగ్ విదేశాలకు వెళ్లి ఉండొచ్చని కూడా వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ ఇంటి దగ్గర పేలుడు పదార్థాలతో కూడిన స్కార్పియో కారు పార్క్ చేసిన కేసు వచ్చిన తర్వాత.. ఆయనను ముంబై పోలీస్ కమిషనర్ పదవి నుంచి తొలగించారు.
కాటరాక్ట్ ఉన్నవారిలో గుండె జబ్బులు ఎక్కువ : ఆస్ట్రేలియా పరిశోధకులు
మయన్మార్లో 100 మిలియన్ సంవత్సరాల వయస్సు పీత శిలాజం గుర్తింపు
ఉన్నత విద్యలో బహుముఖ విధానాలు అవసరం: వెంకయ్యనాయుడు
వడోదరలో ఎయిర్క్రాఫ్ట్ రెస్టారెంట్ ప్రారంభం
చైనా హైపర్సోనిక్ క్షిపణి పరీక్ష నిజమే సుమా: అమెరికా
మోదీ బలం అర్థం చేసుకుంటేనే.. బీజేపీని ఓడించొచ్చు: ప్రశాంత్ కిషోర్
ఈ పరీక్షతో రక్తం గడ్డకట్టడాన్ని గుర్తించొచ్చు.. ఎడిన్బర్గ్ పరిశోధకుల అభివృద్ధి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..