Modi on Ukraine Crisis | ఉక్రెయిన్-రష్యా మధ్య సాగుతున్న యుద్ధంలో ఏ దేశం విజేతగా నిలువబోదని ప్రధాని నరేంద్రమోదీ స్పష్టం చేశారు. ఎల్లవేళలా భారత్ శాంతికే మద్దతునిస్తుందని అన్నారు. మూడు దేశాల పర్యటనలో భాగంగా సోమవారం జర్మనీ రాజధాని బెర్లిన్కు చేరుకున్నారు. జర్మనీ చాన్స్లర్ ఒలాఫ్ స్కూల్జ్తో చర్చల తర్వాత ఆయనతో కలిసి మీడియాతో మాట్లాడారు.
మేం కాల్పుల విరమణ కోసం ఒత్తిడి తెస్తున్నాం. ఉక్రెయిన్ సంక్షోభం మొదలైనప్పటి నుంచి వివాదానికి చర్చలొక్కటే పరిష్కారం అని చెబుతున్నాం అని మోదీ అన్నారు. ఈ యుద్ధంలో ఏ ఒక్కరూ విజేతలు కారు. ప్రతి ఒక్కరూ నష్టపోతారు. అందుకే మేం శాంతికి అనుకూలం అని చెప్పారు.
యుద్ధం వల్ల ఉక్రెయిన్ వాసులకు మానవత్వ సాయంపైనా ప్రతికూల ప్రభావం పడుతుందన్నారు. చమురు ధరలపై ఒత్తిడితో ప్రపంచ వ్యాప్తంగా ప్రతి కుటుంబంపై భారం పడుఉతన్నదని ఆందోళన వ్యక్తం చేశారు.