ముంబై, జూలై 2: మహారాష్ట్రలో శనివారం జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో మృతిచెందిన 24 మందికి ఆదివారం సామూహిక దహన సంస్కారాలు నిర్వహించారు. మొత్తం 25 మంది మృతుల్లో ఒకరి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. మిగిలిన 24 మంది మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా మారిపోయాయి.
దీంతో వారిని గుర్తుపట్టేందుకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు కోరగా… అందుకు ఎక్కువ సమయం పడుతుందని అధికారులు వారికి వివరించారు. సామూహిక దహన సంస్కారాలు నిర్వహించేందుకు వారిని ఒప్పించారు.