శబరిమల, జనవరి 2: కేరళలోని శబరిమల అయ్యప్పస్వామి దేవాలయంలో మండల పూజను పురస్కరించుకుని అనూహ్యంగా ఏర్పడిన రద్దీని దృష్టిలో ఉంచుకుని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) అప్రమత్తమైంది. ఈ నెలలో జరిగే మకరవిళక్కు (మకర జ్యోతి దర్శనం) ఉత్సవానికి అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టింది.
దానిలో భాగంగా మకరవిళక్కుకు స్పాట్ బుకింగ్లను అనుమతించరాదని మంగళవారం నిర్ణయించింది. జనవరి 10 నుంచి స్పాట్ బుకింగ్లు ఉండవని టీడీబీ అధ్యక్షుడు పాశ్నాథ్ తెలిపారు. వర్చువల్ క్యూ బుకింగ్లను కూడా మకరజ్యోతి దర్శనం జరిగే జనవరి 15న 40 వేల మందికే పరిమితం చేయనున్నట్టు చెప్పారు.