న్యూఢిల్లీ: ఉమ్మడి పౌరస్మృతి అమలుకు బీజేపీ కట్టుబడి ఉన్నదని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. గురువారం టైమ్స్ నౌ సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఉమ్మడి పౌరస్మృతి గురించి ప్రశ్నించగా.. జనసంఘ్ నాటి నుంచి దేశ ప్రజలకు బీజేపీ ఇచ్చిన హామీ ఇదని చెప్పారు. ‘సరైన సమయంలో యూసీసీ తీసుకురావాలని రాజ్యాంగ అసెంబ్లీ కూడా పార్లమెంట్కు సూచించింది. ఎందుకుంటే, లౌకిక దేశంలో మత ప్రాతిపదికన చట్టాలు ఉండరాదు. అందరికీ ఒకే చట్టం వర్తించాలి’ అని అన్నారు.
సీబీఐ, ఈడీ, ఐటీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్నదన్న విమర్శలపైనా ఆయన స్పందించారు. సీబీఐ, ఈడీలను దుర్వినియోగం చేస్తున్నట్టు ఫిర్యాదులు ఉంటే కోర్టుకు వెళ్లొచ్చని సూచించారు. మరో కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. మన దేశ చరిత్రను వక్రీకరించారని, దాన్ని సరిచేసేందుకు చరిత్రను తిరగరాయాలని చరిత్రకారులకు సూచించారు.