బెంగళూరు, డిసెంబర్ 2: కాంగ్రె స్ అభ్యర్థుల కోసం కర్ణాటకలో క్యాం పులు ఏర్పాటుచేయాలని తనను ఎవ రూ కోరలేదని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ శనివారం పేర్కొన్నా రు. రాజ్యసభ ఎన్నికల సమయంలో 2017లో గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల కోసం రిసార్టులు, హోటళ్లలో క్యాంపులు ఏర్పాటు చేసినట్టు.. ఈసారి ఏర్పాట్లు చేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం డీకే శివకుమార్కు సూచించినట్టు వార్తలు వచ్చాయి. ఒకవేళ గుజరాత్ పరిస్థితే ఎదురైతే, అధిష్ఠానం చెప్పినట్టుగా చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు.