Central Govt | ఎన్నికలు జరుగతున్న ఐదు రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ సర్టిఫికేట్పై ప్రధాని మోదీ బొమ్మను తీసేయనున్నారు. యూపీ, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం శనివారం ఐదు రాష్ట్రాల ఎన్నికల తేదీలను ప్రకటించింది. దీంతో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినట్లైంది. ఈ కారణంగా ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల్లో ప్రజలకు జారీ చేసిన కోవిడ్ -19 టీకా ధృవీకరణ పత్రాల నుండి ప్రధాన మంత్రి ఫొటోను తొలగించడానికి ఆరోగ్య మంత్రిత్వ శాఖ కోవిన్ ప్లాట్ఫారమ్పై అవసరమైన ఫిల్టర్లను ఇన్స్టాల్ చేస్తుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.