న్యూఢిల్లీ, నవంబర్ 25: మతపరమైన సంబంధాలు ఉన్న అసోసియేషన్లను రాజకీయ పార్టీలుగా రిజిస్టర్ చేయకుండా నిరోధించేందుకు ఎలాంటి చట్టం లేదని కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం సుప్రీంకోర్టుకు తెలిపింది.
రాజకీయ పార్టీలకు కేటాయించిన మతపరమైన గుర్తులు, పేర్లను రద్దు చేయాలని దాఖలైన పిటిషన్పై ఈ మేరకు ఈసీ తమ స్పందనను కోర్టుకు తెలిపింది. అయితే ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లో పొందుపరిచిన నిబంధనల మేరకు రాజకీయ పార్టీలు లౌకిక సూత్రానికి కట్టుబడి ఉండాలని స్పష్టంచేసింది.