లక్నో, మే 19: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నుంచి కొత్త మదర్సాలకు నిధులు ఇవ్వకూడని ఆ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. సీఎం ఆదిత్యనాథ్ అధ్యక్షతన నిర్వహించిన క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ రాష్ట్ర మంత్రి డానిశ్ ఆజాద్ మీడియాకు వెల్లడించారు.
ఇప్పటికే రాష్ట్రంలో 560 మదర్సాలకు ప్రభుత్వం నిధులు ఇస్తున్నదని, కొత్తగా వచ్చే మదర్సాలకు నిధులు ఇవ్వబోమని తెలిపారు.