న్యూఢిల్లీ, డిసెంబర్ 28: కరోనా మూడో డోస్ తీసుకొనే 60 ఏండ్లు, ఆ పైబడిన వయసువారు వైద్యుల నుంచి మెడికల్ సర్టిఫికెట్ తీసుకురావాల్సిన అవసరం లేదని కేంద్రప్రభుత్వం ప్రకటించింది. ఇతర వ్యాధులతో బాధపడుతున్న వృద్ధులు తమకు వైద్యం అందించే డాక్టర్ల నుంచి ఎలాంటి సర్టిఫికెట్లు తీసుకురావాల్సిన అవసరం లేదని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్భూషణ్ మంగళవారం లేఖలు రాశారు.