దేశ రాజకీయాల్లోనే ఓ సంక్షోభముందని, కాంగ్రెస్ నాయకత్వంలో ఎలాంటి సంక్షోభమూ లేదని ఆ పార్టీ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ పేర్కొన్నారు. కొన్ని ఓటములను తాము చూస్తున్న మాట వాస్తవమేనని, అయినంత మాత్రాన పార్టీ బలహీనపడలేదని స్పష్టం చేశారు. జీ 23 గ్రూపు విషయంలో తమకు ఎలాంటి భయమూ లేదని తేల్చి చెప్పారు.
తామే జీ 500, జీ 1000, జీ 2000 గా వున్నామని, ఆ గ్రూపు అంటే తమకు భయం లేదన్నారు. సీబీఐ, ఈడీ లాంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు స్వతంత్రగా వ్యవహరించాలని, ఇదే విషయాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి కూడా ఉటంకించారని ఈయన గుర్తు చేశారు. దేశంలో ఏదో జరుగుతోందని, బీజేపీలో చేరాలని కొందరి నేతలపై తీవ్రమైన ఒత్తిడి ఉందని ఆరోపించారు.