న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సినేషన్లో కాంగ్రెస్, దాని మిత్రపక్షాల పాలిత రాష్ట్రాలు వెనుక ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ లేదా దాని మిత్రపక్షాల పాలిత రాష్ట్రాలు 90 శాతం మందికి పైగా ప్రజలకు మొదటి డోస్, 50 శాతం కంటే ఎక్కువ మందికి 2వ డోస్ ఇవ్వలేకపోయాయని పేర్కొన్నాయి.
మరోవైపు ఏడు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 90 శాతం మందికిపైగా తొలి డోసు, 8 బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 50 శాతం మంది ప్రజలు రెండవ డోస్ పొందినట్లు గణాంకాల ద్వారా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.