న్యూఢిల్లీ: లోక్సభ(Lok Sabha)లో ఇవాళ 20 నిమిషాల పాటు సభా కార్యక్రమాలు ఆడియో(Audio) లేకుండా సాగాయి. ప్రశ్నోత్తరాల సమయంలో లైవ్ ప్రసారాల్లో ఆడియోను ఆపేశారు. బీఆర్ఎస్(BRS)తో పాటు ఇతర విపక్ష సభ్యులు వెల్లోకి దూసుకువెళ్లి నినాదాలు చేస్తున్న సమయంలో.. ఆడియో లేకుండా లైవ్ ప్రసారాలను కొనసాగించారు. స్పీకర్ ఓం బిర్లా(Speaker Om Birla) మాత్రం ఆ ప్రసారాల సమయంలో మౌనంగా ఉండిపోయారు. విపక్షాల వాయిస్ను వినిపించుకుండా చేసేందుకు ఆడియోను మ్యూట్(Audio Mute) చేసినట్లు కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.
नारे लगे – राहुल जी को बोलने दो… बोलने दो.. बोलने दो
फिर ओम बिड़ला मुस्कुराए और सदन म्यूट हो गया।
ये लोकतंत्र है? pic.twitter.com/LL84TP30X6
— Congress (@INCIndia) March 17, 2023
లోక్సభా కార్యక్రమాలు మౌనంగా సాగుతున్న వీడియోను .. కాంగ్రెస్ పార్టీ(congress party) తన ట్విట్టర్లో షేర్ చేసింది. స్పీకర్ బిర్లా చైర్లో ఉండగా.. ట్రెజరీ బెంచుల్లో(treasury benches) ఉన్నఅధికారపక్ష ఎంపీలు తమ సీట్ల వద్ద లేచినిలబడ్డారు. 20 నిమిషాల పాటు ఆడియోను ఆపేశారు. అయితే స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతున్న సమయంలో మళ్లీ ఆడియోను స్టార్ట్ చేశారు.
లోక్సభ ప్రసారాల సమయంలో సౌండ్ ఎందుకు రాలేదన్న దానిపై ప్రభుత్వం ఎటవంటి వివరణ ఇవ్వలేదు. గతంలో మైక్(Mics)లను ఆపేసేవారని, ఇప్పుడు ఏకంగా సభను మ్యూట్ చేశారని, ప్రధాని మోదీ మిత్రుడి కోసం లోక్సభ నోరు ముయించారని కాంగ్రెస్ తన ట్వీట్లో ఆరోపించింది. అదానీ స్టాక్స్(Adani Stocks) కుంభకోణంపై జేపీసీ విచారణ చేపట్టాలని విపక్ష సభ్యులు గత అయిదు రోజులుగా పార్లమెంట్లో ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.