న్యూఢిల్లీ: ఎంబీబీఎస్ విద్యార్థులు అడ్మిషన్ పొందిన తర్వాత పదేండ్లలోపు కోర్సు పూర్తిచేయాలని జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) ప్రతిపాదించింది. నాన్-సీరియస్ విద్యార్థులను తప్పించేందుకు చేసిన ఈ ప్రతిపాదనను కేంద్రానికి పంపింది. ‘సాధారణంగా వైద్య విద్యార్థులు పట్టభద్రులు కావడానికి సుదీర్ఘ సమయం తీసుకోరు. కానీ తీసుకుంటున్నారనడానికీ చాలా ఉదాహరణలు ఉన్నాయి. వీరిలో విదేశాల్లో ఎంబీబీఎస్ చదివిన వాళ్లూ ఉంటున్నార’ని ఎన్ఎంసీలోని యూజీ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డు అధ్యక్షురాలు అరుణ తెలిపారు. విద్యార్థులు మధ్యలో కొన్నేండ్లపాటు చదువు ఆపేయడానికి కూడా కొన్ని వర్సిటీలు అనుమతిస్తున్నాయన్నారు.