న్యూఢిల్లీ: ప్రస్తుతం ఎంబీబీఎస్ పూర్తి చేయడానికి ఉన్న 9 ఏండ్ల గడువును 10 ఏండ్లకు పెంచాలని జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ) ప్రతిపాదించింది. ఈ మేరకు ముసాయిదా నోటిఫికేషన్ను ఇటీవల జారీ చేసింది. తప్పనిసరిగా పూర్తి చేయాల్సిన రొటేటింగ్ ఇంటర్న్షిప్తో కలిపి అండర్ గ్రాడ్యుయేట్ వైద్య విద్య పూర్తి చేయడానికి ఒక సంవత్సరం అదనంగా ఇవ్వాలని సవరణలో ప్రతిపాదించింది.
మొదటి ప్రొఫెషనల్ ఎంబీబీఎస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి అనుమతించే నాలుగు ప్రయత్నాల్లో ఎలాంటి మార్పు ఉండదని తెలిపింది. పట్టభద్ర వైద్య విద్య నిబంధనలు, 2023లో తాజా ప్రతిపాదనలపై సంబంధిత వ్యక్తుల నుంచి సూచనలు, సలహాలను ఎన్ఎంసీ ఆహ్వానించింది.