Nitish Kumar | బీహార్ సీఎంగా జేడీయూ నేత నితీశ్ కుమార్ యాదవ్ బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారని తెలుస్తున్నది. మంగళవారం రబ్రీదేవి నివాసంలో జరిగిన సమావేశంలో ఆర్జేడీ-కాంగ్రెస్- లెఫ్ట్ పార్టీలతో కూడిన మహాఘట్బంధన్ కూటమి నేతగా నితీశ్ కుమార్ ఎన్నికయ్యారు. అటుపై ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్తో కలిసి రాజ్భవన్కు చేరుకున్నారు.
అంతకుముందు జేడీయూ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో నితీశ్ కుమార్ సమావేశమై పరిస్థితిని వివరించారు. బీజేపీతో కలిసి ముందుకు సాగలేమని చెప్పారు. దీంతో ఎన్డీఏ నుంచి బయటకు రావాలన్న నిర్ణయానికి జేడీయూ నేతలు ఆమోద ముద్ర వేసినట్లు తెలుస్తున్నది. ఆ వెంటనే గవర్నర్ను కలిసి బీహార్ సీఎంగా నితీశ్ కుమార్ రాజీనామా చేశారు.
రాజ్భవన్ నుంచి నేరుగా రబ్రీదేవి నివాసానికి చేరుకుని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తదితరులతో నితీశ్ కుమార్ సమావేశమయ్యారు. ఇప్పటికే పాట్నాలోని రబ్రీదేవి నివాసంలో జరిగిన మహాఘట్బంధన్ సమావేశంలో ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాల ఎమ్మెల్యేలు నితీశ్కు మద్దతు తెలుపుతూ రాసిన లేఖపై సంతకాలు చేశారు. మొత్తం 160 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖలను గవర్నర్కు నితీశ్కుమార్ అందజేశారు.