Nitish Kumar | పాట్నా : జేడీయూ అధినేత నితీశ్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రిగా ఎనిమిదో సారి ప్రమాణం చేయబోతున్నారు. ఇందుకు ముహుర్తం ఖరారైంది. ఆదివారం సాయంత్రం 5 గంటలకు సీఎంగా నితీశ్, డిప్యూటీ సీఎంలుగా సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.
ఆర్జేడీతో తెగదెంపులు చేసుకున్న జేడీయూ.. బీజేపీతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఆర్జేడీ మంత్రుల స్థానంలో బీజేపీ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం ఉంది. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీహార్ లోక్సభ స్థానాలపై బీజేపీ దృష్టి పెట్టింది. ఇండియా కూటమిలో కీలకంగా వ్యవహరించిన నితీశ్ కుమార్ను తనవైపు తిప్పుకుంది బీజేపీ. దీంతో బీహార్లోని 40 ఎంపీ స్థానాల్లో బీజేపీ పాగా వేయాలని చూస్తోంది.