పాట్నా : బిహార్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎనిమిదోసారి నితీశ్కుమార్ ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ ఫగు చౌహాన్ నితీశ్కుమార్తో ప్రమాణస్వీకారం చేశారు. ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ప్రమాణం చేశారు. బీజేపీ, జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) సంకీర్ణ ప్రభుత్వాన్ని రద్దు చేసి, ఆయన ముఖ్యమంత్రిగా రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్ష పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఇవాళ ప్రమాణస్వీకారం చేశారు.
2020లో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఎన్డీయే కూటమి గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. 245 సీట్లున్న బీహార్ అసెంబ్లీలో రెండు స్థానాలు నామినేటెడ్ కాగా, 243 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో మహా ఘట్బంధన్ కూటమిలోని ఆర్జేడీ 75 సీట్లు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ 74, జేడీయూ 43, కాంగ్రెస్ 19 సీట్లు గెలిచాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి 122 మంది సభ్యుల మద్దతు అవసరం కాగా, బీజేపీ, జేడీయూ, వీఐపీ, హెచ్ఏఎల్తో కలిసి నితీశ్ నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడింది. ఈ కూటమిలో ఈ ఏడాది ప్రారంభంలో చీలికలు ప్రారంభమయ్యాయి. చివరకు బీజేపీతో నితీశ్కుమార్ తెగతెంపులు చేసుకున్నారు.