పట్నా : బిహార్లో ఉప ఎన్నికలకు ముందు నితీష్ కుమార్ ప్రభుత్వం ప్రజలకు మద్యం, డబ్బులు, చీరలు పంచుతోందని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ శుక్రవారం ఆరోపించారు. ఛాత్ పూజ పేరుతో నితీష్ సర్కార్ ప్రజలను ప్రలోభాలకు లోను చేస్తోందని అన్నారు. ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపడితే ఇప్పుడు పంపకాల సమస్య ఉత్పన్నమయ్యేది కాదని అన్నారు.
ఆర్జేడీకి అనుకూలంగా ఓటింగ్ జరిగేలా అధికారులపై నితీష్ ప్రభుత్వం ఒత్తిడి తీసుకువస్తోందని తేజస్వి యావ్ ఆరోపించారు. తమ ఫిర్యాదు ఆధారంగా ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గంలో డీఎస్పీని ఈసీ విధుల నుంచి తొలగించిందని, ఇది తమ ఆరోపణలు వాస్తవమని నిరూపించిందని పేర్కొన్నారు. ఉప ఎన్నికల్లో గెలిచేందుకు పాలక ప్రభుత్వం ఎన్ని అక్రమాలకు పాల్పడినా ఎన్నికల్లో తామే విజయం సాధిస్తామని తేజస్వి యాదవ్ ధీమా వ్యక్తం చేశారు.