Nitish kumar| పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీశ్కుమార్ ఏ క్షణమైనా తిరిగి ఎన్డీఏ కూటమిలో చేరొచ్చని కేంద్ర మంత్రి రామ్దాస్ అథావలే వ్యాఖ్యానించారు. వచ్చే నెలలో ముంబైలో నిర్వహించే విపక్ష ‘ఇండియా’ కూటమి సమావేశానికి హాజరుకావొద్దని ఆయన నితీశ్కు సూచించారు. ఎన్డీఏలో నితీశ్ లోటు ఎప్పుడూ కనిపిస్తుందని అన్నారు. చాలా కాలంగా తనకు నితీశ్తో మంచి సాన్నిహిత్యం ఉందని పేర్కొన్నారు. ఎన్డీఏ నుంచి జేడీయూ వీడినప్పటికీ బీహార్కు కేంద్రం నుంచి అన్ని విధాలుగా సహకారం కొనసాగుతుందని చెప్పారు. విపక్ష ఎంపీలు మణిపూర్లో పర్యటించడంపై ఆయన స్పందిస్తూ.. రాజకీయ ప్రయోజనాల కోసం విపక్షం ప్రయత్నిస్తున్నదని విమర్శించారు.
నితీశ్కుమార్ 2022 ఆగస్టులో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు. మాజీ ప్రత్యర్థి ఆర్డేజీతో చేతులు కలిసి బీహార్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుచేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలు ఏర్పాటుచేసిన ఇండియా కూటమిలో నితీశ్ కుమార్ కీలక సభ్యుడిగా ఉన్నారు.