పాట్నా, నవంబర్ 22: బీహార్కు ప్రత్యేక హోదా కల్పించాలని నితీశ్ ప్రభుత్వం మరోసారి డిమాండ్ చేసింది. హోదా కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ క్యాబినెట్లో ఓ తీర్మానాన్ని ఆమోదించింది.
బీహార్లో నివసిస్తున్న వారిలో దాదాపు 94 శాతం కుటుంబాలు పేదరికంలోనే ఉన్నాయని, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని సీఎం నితీశ్ తెలిపారు.