పాట్నా, ఆగస్టు 6: ప్రధాని మోదీ అధ్యక్షతన ఆదివారం జరుగనున్న నీతిఆయోగ్ సమావేశాన్ని బీహార్ సీఎం నితీశ్కుమార్ బహిష్కరించారు. తొలుత డిప్యూటీ సీఎంను సమావేశానికి పంపాలని భావించినా.. ఆ సమావేశానికి సీఎంలు మాత్రమే హాజరుకావాలని కేంద్రం కచ్చితంగా చెప్పడంతో బీహార్ తరఫున ఎవరూ వెళ్లట్లేదు.
ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతిగా ఎన్నికైన సందర్భంగా ప్రధాని మోదీ ఏర్పాటు చేసిన సమావేశానికి ఇటీవల నితీశ్ గైర్హాజరయ్యారు. కాగా, గత కొద్ది నెలలుగా వాయిదా పడుతున్న ప్రజాదర్బార్ను సోమవారం నితీశ్కుమార్ నిర్వహించనున్నట్టు సమాచారం.