NITI Aayog | నీతి ఆయోగ్ సోమవారం హెల్త్ ఇండెక్స్ను విడుదల చేసింది. ఇందులో దక్షిణాది రాష్ట్రాలు ముందు వరుసలో ఉండగా, ఉత్తరాది రాష్ట్రాల పరిస్థితి ఘోరంగా ఉంది. ఆరోగ్య రంగంలో సేవలందించే రాష్ట్రాల్లో పినరయ్ విజయన్ నేతృత్వంలోని కేరళ ప్రభుత్వం నెంబర్ 1 స్థానంలో నిలిచింది. స్టాలిన్ నేతృత్వంలోని తమిళనాడు రెండో స్థానంలో ఉంది. ఇక కే. చంద్రశేఖర రావు నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం మూడో స్థానంలో ఉంది. అయితే యోగి నేతృత్వంలోని యూపీ ప్రభుత్వం మాత్రం ఇందులో వెనకబడింది. చివరి స్థానాన్ని దక్కించుకుంది. ఇక.. నితీశ్ కుమార్ నేతృత్వంలోని బిహార్ రాష్ట్రం 18 వ స్థానాన్ని దక్కించుకుంది.