ముంబై: అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ (IOC) అధ్యక్షుడు థామస్ బాచ్కు (Thomas Bach) రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ (Mukesh Ambani) అదిరిపోయే ఆతిథ్యమిచ్చారు. ఒలింపిక్స్ (Olympics) ప్రమోషన్స్లో భాగంగా భారత పర్యటనలో ఉన్న థామస్ బాచ్ బుధవారం ఉదయం ముంబైలోని అంబానీ నివాసం ఆంటిలియా (Antilia)కు వెళ్లారు. ఈ సందర్భంగా ముఖేశ్ సతీమణి నీతా అంబానీ (Nita Ambani) ఆయనకు బొట్టుపెట్టి.. హారతి పట్టారు. అనంతరం ముగ్గురూ కలిసి ఫొటోలకు పోజులిచ్చారు.
కాగా, భారత్లో ఒలింపిక్ క్రీడల గొప్పతనాన్ని ప్రచారం చేయాలనే ఒప్పందంపై అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం, రిలయన్స్ కంపెనీ సంయుక్తంగా సంతకాలు చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మొదటగా ముంబై లో ఎంపిక చేసి స్కూల్ పిల్లలకు అథ్లెట్లతో సెషన్ల వారీగా ఒలిపింక్ పోటీల ఔన్నత్యాన్ని వివరించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా మహారాష్ట్రలో 1.75 కోట్ల మంది పిల్లల్లో స్ఫూర్తి నింపనున్నారు.
👍🙏
— Amit_Saharan_Chautala (@am49248) October 11, 2023