న్యూఢిల్లీ: పార్లమెంట్లో భద్రతా వైఫల్యంపై విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై ప్రధానమంత్రి లేదా కేంద్ర హోం మంత్రి జవాబు చెప్పాలని పెద్దఎత్తున డిమాండ్ చేస్తున్నాయి. దాంతో లోక్సభలో 13 మంది ఎంపీలు, రాజ్యసభలో ఒకరు సస్పెన్షన్కు గురయ్యారు. ఈ క్రమంలోనే విపక్షాల ఆందోళనలపై బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పార్లమెంట్లో భద్రతా వైఫల్యాలు ఇదే తొలిసారి కాదని, 1974, 1994లో కూడా చోటు చేసుకున్నాయని చెప్పారు. పార్లమెంట్ భద్రత కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన బాధ్యత కాదన్నారు. పార్లమెంట్ భద్రత వైఫల్యంపై ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడాలని విపక్షాలు ఆందోళన చేయడం సరికాదని మండిపడ్డారు. పార్లమెంట్ భద్రతా వ్యవహారం మొత్తం లోక్సభ సెక్యూరిటీకి సంబంధించిందని అన్నారు.
1974లో ఓ వ్యక్తి ఏకంగా రెండు తుపాకులు చేతిలో పట్టుకొని పార్లమెంట్లోకి వచ్చాడని, కానీ నాటి ప్రతిపక్షమైన జనసంఘ్ దాన్ని వివాదం చేయలేదని అన్నారు. ప్రధాన మంత్రి, హోం మంత్రి బాధ్యత వహించాలని నిరసనలు తెలుపలేదని గుర్తుచేశారు. పార్లమెంట్ భద్రత బాధ్యత పూర్తిగా లోక్సభ సెక్రటేరియట్కు చెందినదని ట్విటర్లో పేర్కొన్నారు.