Shashi Tharoor | కోజికోడ్, సెప్టెంబర్ 29: వచ్చే లోక్సభ ఎన్నికల్లో కేరళలోని ముఖ్యమైన ఆరు స్థానాలపై బీజేపీ కన్నేసింది. ఇప్పటి నుంచే అక్కడ అభ్యర్థుల వేటలో పడింది. కేరళలో స్థానిక నేతల కన్నా ఇతర ప్రాంతాలకు చెందిన జాతీయ నేతలను బరిలోకి దింపాలన్న యోచనలో బీజేపీ ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది.
ఇప్పటికే త్రిస్సూర్లో నటుడు, బీజేపీ నేత సురేష్ గోపీ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని రాష్ట్ర అధ్యక్షుడు కే సురేంద్రన్ ప్రకటించారు. తిరువనంతపురంలో కాంగ్రెస్ నేత శశిథరూర్ను ఈసారి ఎలాగన్నా ఓడించాలన్న లక్ష్యంలో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, రాజీవ్ చంద్రశేఖర్లలో ఒకరిని బరిలోకి దించే అవకాశం ఉన్నట్టు సమాచారం.