న్యూఢిల్లీ: లెజండరీ ఇండియన్ బాక్సర్ మేరీ కోమ్తో దిగిన ఫోటోను ఇవాళ నిఖత్ జరీన్ తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేసింది. దీంతో ఆ ఇద్దరి మధ్య గతంలో ఏర్పడిన గొడవ సమసిపోయినట్లు స్పష్టమవుతోంది. ఇటీవల ముగిసిన వరల్డ్ బాక్సింగ్ చాంపియన్షిప్లో తెలంగాణకు చెందిన నిఖత్ జరీన్ 52 కిలోల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన విషయం తెలిసిందే. అయితే మహిళల బాక్సింగ్ చాంపియన్షిప్లో ఆరుసార్లు గోల్డ్ మెడల్స్ సాధించిన మేరీకోమ్ను నిఖత్ కలుసుకున్నది. ఈ సందర్భంగా ఆ ఇద్దరూ ఫోటో దిగారు. నువ్వు ఆరాధించే వ్యక్తి ఆశీస్సులు లేకుండా విజయం పూర్తి కాదన్న సందేశాన్ని నిఖత్ తన ట్వీట్లో వెల్లడించింది. నిఖత్ పోస్టు చేసిన ఫోటోకు వేల సంఖ్యలో లైక్లు, రీట్వీట్లు వస్తున్నాయి.
ఇద్దరి మధ్య వివాదం..
నిజానికి 2020 టోక్యో ఒలింపిక్స్ సమయంలో ఇద్దరి మధ్య వివాదం మొదలైంది. 2019 సంవత్సరంలో జరిగిన ట్రయల్స్ సమయంలో మేరీకోమ్, నిఖత్ మధ్య స్పర్ధలు చెలరేగాయి. ఒలింపిక్ సెలక్షన్ ప్రక్రియ సరైన రీతిలో లేదని నిఖత్ ఆ సమయంలో ఆరోపించారు. ఇక ఆ ఇద్దరి మధ్య మ్యాచ్ ముగిసిన తర్వాత నిఖత్కు షేక్హ్యాండ్ ఇవ్వకుండానే మేరీకోమ్ వెళ్లిపోయారు. ఇతరుల్ని గౌరవించడం తెలినవారిని మాత్రమే గౌరవిస్తానని, నువ్వేదైనా చెప్పాలనుకుంటే రింగ్లోనే చూపాలని గతంలో మేరీ కోమ్ పేర్కొన్నది. అయితే ఆనాటి చేదు సంఘటనలను ఇద్దరూ మరిచిపోయారు.
క్షమించా..
స్వర్ణ పతకం సాధించిన నిఖత్కు మాజీ చాంపియన్ మేరీకోమ్ కంగ్రాట్స్ చెప్పింది. భవిష్యత్తులో జరగబోయే టోర్నీల్లో విజయం సాధించాలని మేరీ కాంక్షించారు. గతంలో మేరీతో జరిగిన విభేదాన్ని మరిచిపోయానని, ఆమెను క్షమించినట్లు నిఖత్ ఓ మీడియాతో చెప్పింది. ఇస్లాంబుల్లో జరిగిన వరల్డ్ చాంపియన్షిప్లో 52 కేజీల విభాగంలో థాయిలాండ్ బాక్సర్ జిట్పాంగ్ జులామస్పై 5-0 తేడాతో నెగ్గి నిఖత్ గోల్డ్ మెడల్ సాధించిన విషయం తెలిసిందే.
No victory is complete without your idol’s blessings😇🙌🏻@MangteC #HappyMorning#HappyMe#HappyUs pic.twitter.com/uXJFcK9nMu
— Nikhat Zareen (@nikhat_zareen) May 25, 2022