బెంగళూరు: కర్ణాటక రాష్ట్రం కూడా నైట్ కర్ఫ్యూ బాట పట్టింది. రాజధాని బెంగళూరుతోపాటు మరో ఆరు నగరాల్లో ఈ నెల పది నుంచి రాత్రి కర్ఫ్యూ అమలు చేయనున్నది. రాత్రి పది గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ విధిస్తారు. బెంగళూరు, మైసూర్, మంగళూరు, కాలాబుర్గి, బీదర్, తుమకూరు, మణిపాల్ నగరాల్లో ఈ నెల 20 వరకు నైట్ కర్ఫ్యూ అమలులో ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం గురువారం పేర్కొంది. దేశంలో కరోనా పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన కొన్ని గంటల్లోనే నైట్ కర్ఫ్యూ నిర్ణయాన్ని యెడియూరప్ప సర్కార్ తీసుకున్నది.