ప్రచారం: ‘నుపూర్ వివాదం నేపథ్యంలో హిందువుల తలలను తెగనరుకుతామని కొందరు బెదిరింపు కాల్స్ చేస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. ఆ హెచ్చరికలకు పాల్పడే వారి వివరాలు మాకు ఇవ్వండి’ అంటూ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రజలను కోరినట్టు సోషల్మీడియాలో కొన్ని సందేశాలు, పోస్టులు వైరల్గా మారాయి.
వాస్తవం: సోషల్మీడియాలో ప్రచారమవుతున్న వార్తలు అసత్యమని ఎన్ఐఏ గురువారం తెలిపింది. పైన పేర్కొన్నట్టు ఎలాంటి విజ్ఞప్తులను తాము చేయలేదని స్పష్టం చేసింది. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఇలాంటి ఫేక్ న్యూస్ ప్రచారం అవుతున్నదని, వీటిని నమ్మవద్దని, ఆ మెసేజ్లను ఫార్వర్డ్ చేయవద్దని ప్రజలను కోరింది.