NIA | విదేశాల్లోని భారతీయ రాయబార కార్యాలయాలపై ఇటీవల జరిగిన దాడుల అనుమానితులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) గుర్తించింది. అమెరికా, బ్రిటన్, కెనడా దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలపై ఇటీవల దాడులు జరిగాయి. 2023 మార్చి 19న లండన్ లోని భారత్ రాయబార కార్యాలయంపై ఖలిస్థానీయులు రెండు వేర్వేరు దాడులు చేశాయి. జూలై రెండో తేదీన అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో ఇటువంటి దాడులే జరిగాయి. కెనడాలోని భారత ఎంబసీపై గత మార్చిలో దాడి జరిగింది.ఈ దాడులకు పాల్పడిన 43 మంది అనుమానితులను ఎన్ఐఏ గుర్తించింది. వారంతా ఖలిస్తాన్ మద్దతుదారులని తెలుస్తున్నది.
ఈ దాడులపై విచారణకు చర్యలు తీసుకోవాలని ఎన్ఐఏకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో గత జూన్ నెలలో అమెరికా, బ్రిటన్, కెనడాల్లోని భారత రాయబార కార్యాలయాలపై దాడుల కేసుపై ఎన్ఐఏ దర్యాప్తు ప్రారంభించింది. ఆయా దాడులు జరిగిన భారత రాయబార కార్యాలయాలను సందర్శించినట్లు ఎన్ఏఐ అధికారులు తెలిపారు. ఈ కేసులో ఎన్ఐఏ అధికారులు భారత్లో 50 చోట్ల దాడులు జరిపి 80 విచారణ జరిపారని తెలిసింది.