న్యూఢిల్లీ: నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) కార్యకలాపాలకు సంబంధించి ఎన్ఐఏ ఆరు రాష్ర్టాల్లో సోదాలు జరిపింది. గత సంవత్సరం ప్రధాని మోదీ బీహార్ పర్యటన సందర్భంగా అవాంతరాలు సృష్టించడానికి పీఎఫ్ఐ యత్నించినట్టు ఆరోపణలు రావడంతో కేసు నమోదైంది.
దర్యాప్తులో భాగంగా బుధవారం ఆరు రాష్ర్టాల్లో ఎన్ఐఏ సోదాలు జరిపింది. ముంబై, రాజస్థాన్లోని టోంక్, కోటా, గంగాపూర్, ఢిల్లీలోని హౌజ్కాజీ, బాలిమరన్, తమిళనాడు, మధ్యప్రదేశ్లో సోదాలు నిర్వహించింది.