న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లోని సందేశ్ఖాలీలో ఇటీవల చోటు చేసుకొ న్న హింసాకాండ, లైంగిక దాడుల ఆరోపణలు నిజమేనని జాతీయ మానవ హక్కుల కమిషన్ శనివారం తెలిపింది. కమిషన్ జరిపిన స్పా ట్ విచారణలో సందేశ్ఖాలీలో అనే క మానవ హక్కుల ఉల్లంఘనలు జరిగాయని వెల్లడైంది. స్థానికులకు క నీస వేతనాలు కూడా చెల్లించడం లే దని తేలింది.
రాష్ట్ర, కేంద్ర ప్రథకాల ను ఈ ప్రాంత వాసులకు అందించకుండా వివక్ష చూపారని కమిషన్ వె ల్లడించింది. స్థానికుల ఓటు హక్కు ను కూడా హరించారని ఎన్హెచ్ఆర్సీ పేర్కొంది. ఇంత జరుగుతున్నా స్థానిక అధికార యంత్రాంగం స్పం దించలేదని కమిషన్ ఆరోపించింది. మొత్తం వ్యవహారంపై 8 వారాల్లోగా తీసుకున్న చర్యల నివేదికను సమర్పించాలని ఆదేశించింది.