నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్
న్యూఢిల్లీ: మాస్కులు అవసరం ఇప్పుడప్పుడే తీరిపోదని, వచ్చే ఏడాదంతా కూడా మాస్కులను ధరించాల్సి ఉంటుందని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ స్పష్టం చేశారు. కరోనాపై యుద్ధానికి వ్యాక్సిన్లు, ప్రభావవంతమైన ఔషధాలు, నిబంధనలు, జాగ్రత్తలు పాటించడం అవసరమని చెప్పారు. ‘మాస్కులు ధరించడం, చేతులు శుభ్రం చేసుకోవడం, శానిటైజర్లు వినియోగించడం, భౌతికదూరం పాటించడాన్ని కొనసాగించాల’ని ఆయన సూచించారు.